Friday, April 26, 2024

మా స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు..వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్..

ఏపీలో ప్ర‌జాస్వామ్యం ఉందా అని టిడిపి అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మండిపడ్డారు. ఎన్నికల‌ను నిర్వహించడం చేతగాకపోతే తప్పుకోమ‌ని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసి, డీజిపి పదవులనుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిక ను అడ్డుకునే బదులు అధికార పార్టీ వారిని చైర్మన్ గా నియమించుకోమ‌న్నారు.

భయ భ్రాంతులకు గురిచేసి టిడిపి సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారని తెలిపారు. మారణా యుధాలతో సంబంధం లేని వ్యక్తులు హల్ చల్ చేస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారన్నారు. ఎంపి నానితో సహా టిడిపి సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని.. మా సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దని వార్నింగ్ ఇచ్చారు. కొండపల్లి చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాల‌ని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement