Thursday, May 2, 2024

TS | 27న‌ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు

భారత రాష్ట్ర సమితిగా అవతరించిన ‘‘తెలంగాణ రాష్ట్ర సమితి’’ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. రేపు (ఏప్రిల్ 27న) అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అందరూ బిజీగా ఉన్నందున ఎలాంటి సందడి చేయవద్దని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు జెండా వందన కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పార్టీ నాయకులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భవించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి… బీఆర్‌ఎస్ గా పరిణితి చెంది రైతులు, కూలీలు, సాగుదారుల కోసం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాడుతూనే ఉంటుందని అన్నారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జెండాను ఆవిష్కరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement