Thursday, May 2, 2024

AP | జల్లేరు వాగులో మునిగి ముగ్గురు మృతి..

ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. జల్లేరు నదిలో శుక్రవారం ఈత కొట్టేందుకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు. మృతులు ఊట్లపల్లి, దిబ్బగూడానికి చెందిన రేష్మ(24), మొహిషాద్(23), హసద్(14)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement