Friday, May 3, 2024

HYD: వాసవి డెంటల్ క్లినిక్ ను ప్రారంభించిన ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : కొత్తపేటలోని వాసవి నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వాసవి డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌రై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దంతాలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా.. చిగుళ్ల వ్యాధి, దంత సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ కుమార్, పరమేష్, వాసవి డెంటల్ కేర్ డా. చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement