Friday, May 17, 2024

HYD: వరంగల్, వెలుపల వైద్య నిధుల సేకరణను అనుమతిస్తున్న మిలాప్

హైద‌రాబాద్ : భారతదేశంలో అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్, మిలాప్.ఆర్గ్ భారతదేశంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, స్మారక చిహ్నాలు, ఇతర సామాజిక కారణాల సమయంలో ఆర్థిక సహాయం కోరే వ్యక్తులు, కుటుంబాలకు విశ్వసనీయ పేరుగా మారింది. దాదాపు 9లక్షలకు పైగా ఫండ్ రైజర్లు, ఇప్పటి వరకు రూ.2400 కోట్లకు పైగా సేకరించడంతో, మిలాప్ సమాజంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. క్రౌడ్‌ఫండింగ్‌ని ఉపయోగించి ఆర్థిక సహాయం కోరే ధోరణిలో వరంగల్ కూడా చేరింది. వరంగల్ నుండి దాదాపు 550 మంది ఫండ్ రైజర్లు రూ.6 కోట్లకు పైగా సేకరించగలిగారు.

ఈసంద‌ర్భంగా మిలాప్ కమ్యూనికేషన్స్ హెడ్ సయంతీ రే మాట్లాడుతూ… వరంగల్ నుండి ఏర్పాటు చేసిన ఫండ్ రైజర్లు, సేకరించిన మొత్తం స్థానిక సమాజం దాతృత్వానికి, సంఘీభావానికి నిదర్శనమ‌న్నారు. ఇది క్లిష్టమైన శస్త్ర‌ చికిత్సకు నిధులు సమకూర్చినా, విషాద సమయంలో కుటుంబాలను ఆదుకున్నా, లేదా సాంఘీక కారణాలకు సహాయం చేయడం అయినా అవసరమైన వ్యక్తులను మిలాప్ కలుపుతుందని అన్నారు.

వరంగల్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ పటేల్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కోమాలోకి జారుకున్నాడు. ఆర్థిక సహాయం కోసం అతని సోదరుడు మిలాప్‌లో నిధుల సేకరణ ప్రారంభించగా 100మందికి పైగా ముందుకు రావడంతో, సుమారు రూ.14 లక్షలను సేకరించగలిగారు. అలాగే రామకృష్ణ కుమారుడు నిహాల్ అనే బాలుడు పుట్టుకతోనే ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ అనే కాలేయ రుగ్మతతో బాధపడుతుండగా రెయిన్ బో హాస్పిటల్ లో కాలేయ మార్పిడి చికిత్స కోసం సుమారు 1000మందికి పైగా దాతల సహాయంతో రూ. 22 లక్షలు సేకరించి చిన్నారికి చికిత్స అందించగలిగారన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement