Sunday, May 19, 2024

SRH vs RR | మరోసారి 200దాటిన సన్‌రైజర్స్‌.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సారి భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగన హైదరాబాద్.. రాజస్థాన్ ముందు 202 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది. విధ్వంసకరి హైదరాబాద్‌ ఆటగాళ్లను రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లు ఆది నుంచి కట్టడిచేసే ప్రయత్నం చేశారు. అయితే, ట్రావిస్ హెడ్, నితీశ్‌ రెడ్డి ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. పవర్‌ ప్లే ముగిసేసరికి 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ (58) జోరు పెంచి హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు నితిష్ కుమార్ రెడ్డి విజృభించాడు. 42 బంతుల్లో 76 పరుగులతో హాఫ్​ సెంచరీతో చెలరేగాడు. 15వ ఓవర్‌లో హెడ్ ఔటౌన తరువాత క్రీజ్‌లోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ నితిష్ రెడ్డికి తోడయ్యాడు. 19 బంతుల్లో 42 పరుగులతో మరోసారి 200 పరుగులు దాటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement