Wednesday, July 24, 2024

Ts | అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా… ఒకరు మృతి

వరంగల్ జిల్లా : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డిసి తండాలో (శనివారం) ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో డిసి తండాకు చెందిన ఆంగోత్ వాసు (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండా శివారులోని ట్రాక్టర్ ఫై ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి చెందిన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు కొనసాగించారు. మృతుడికి భార్య, సంవత్సరం పాప ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement