Saturday, April 20, 2024

అమెజాన్..ప్లిప్ కార్ట్ ల‌కు నోటీసులు..

ఈ కామర్స్ దిగ్గ‌జాలు అమెజాన్ , ప్లిప్ కార్ట్ ల‌కు కేంద్ర వినియోగ‌దారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ నోటీసులు పంపింది. నాసిర‌కం వ‌స్తువులు విక్ర‌యించినందుకు ప్లిప్ కార్ట్,అమెజాన్ ల‌కు నోటీసులు జారీ చేసింది. బీఐఎస్ మార్కుకు లోబడి లేని ప్రెజర్ కుక్కర్ లను అమ్మినందుకు నోటీసులిచ్చింది. పేటీఎం మాల్, స్నాప్ డీల్, షాప్ క్లూస్ తదితర ఈ కామర్స్ సంస్థలకూ నోటీసులు అందాయి. ఈ నెల 18నే నోటీసులిచ్చినట్టు సీసీపీఏ వెల్లడించింది.నాణ్యత నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా చర్యలను తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది. ప్రెజర్ కుక్కర్లతో పాటు 13 రకాల ఉత్పత్తుల విక్రయాలపై సీసీపీఏ దృష్టి సారించింది. హెల్మెట్ల క్వాలిటీనీ పరిశీలించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement