Tuesday, May 7, 2024

TS | తెలంగాణకు అక్కరకు రాని చుట్టం బీజేపీ: కేసిఆర్

నరేంద్ర భాయ్ బడే భాయ్ అయితే… ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చోటే భాయ్.. లోక్‌సభ ఎన్నికల్లో చోటే భాయ్‌కి ఓటు వేసిన నరేంద్ర మోడీకి ఓటు వేసిన ఒక్కటే.. ఎవరికి ఓటు వేసిన మోటార్లకు మీటర్లు పెడుతారు అని కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయబావుల దగ్గర మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్ల గ్రాంట్‌ బంద్‌చేస్తా అని నరేంద్ర మోదీ చెప్పిండు. నేను నా ప్రాణంపోయినా.. తలకాయ తెగినా మీటర్లు పెట్టా అని చెప్పినట్లుగా కేసీఆర్ తెలిపారు. బీజేపీకి ఓట్లు వేస్తే కచ్చితంగా మీటర్లు పెడుతరు. మీటర్లు పెట్టించుకునేందుకు బీజేపీకి ఓటు వేయాలా? దయచేసి ఆలోచన చేయాలి అని కేసీఆర్ అన్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర వాళ్లు ఇక్కడ నుండి కాలువ పెట్టి మన నీళ్లు తీసుకుపోతుంటే.. రఘువీరా రెడ్డి పాదయాత్ర చేసుకుంటూ వస్తే ఇదే డీకే అరుణ నీళ్లు తీసుకుపొండి అని మంగళ హారతులు పట్టింది. ఈమెకు మనం ఓటు వేయాలా అని ధ్వజమెత్తారు.

తేలంగాణకు ఒక్క నవోదయ స్కూల్, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వని ప్రధాని మోదీ విశ్వగురువా అని కేసిఆర్ ప్రశ్నించారు. బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము.. మొక్కినా వరమియ్యని వేల్పు… ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి ? మన కన్ను మనమే పొడుసుకుందమా? అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement