Sunday, May 19, 2024

AP: అల్లూరి స్ఫూర్తితో అణ‌చివేత‌ను ఎదిరించండి… చంద్ర‌బాబు

క్రూర‌త్వాన్ని ఎదిరించిన సీతారామ‌రాజే ఆద‌ర్శం
ఈ ఎన్నిక‌ల‌లో ప్ర‌జ‌ల‌ను గెలిపిద్దాం
ట్విట్ట‌ర్ ద్వారా చంద్ర‌బాబు పిలుపు
అమ‌రావ‌తి – సామాన్యులపై జరిగే అణచివేతను మహనీయుల స్ఫూర్తిగా ఎదిరించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. అల్లూరికి నివాళులర్పిస్తూ ఆ మహానుభావుడి స్ఫూర్తిని అంతా అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

గిరిజనుల పట్ల బ్రిటీష్ పాలకులు చూపించిన క్రూరత్వాన్ని అల్లూరి ఎదిరించారని, గిరిజనుల కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మన పోరాటాన్ని ఉద్ధృతం చేయాలన్నారు. ఇన్నాళ్లూ చేసిన పోరాటం ఇప్పుడు ఎన్నికల రూపం దాల్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నికల పోరాటంలో ప్రజలను గెలిపిద్దామ‌ని అన్నారు. సామాన్యులపై జరిగే ప్రతీ అణచివేతను ఎదిరించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement