Friday, July 26, 2024

TS | పిడుగుపాటుకు ముగ్గురు మృతి..

రాష్ట్రంలోని విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల్ మండలంలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన గొల్ల వెంకటయ్య(62) పొలం పనులు చేస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

అలాగే పెర్కంపల్లి గ్రామంలో మరో ఇద్దరు మృతి చెందారు. పిడుగుపాటుకు జుంటుపల్లి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్ (27), లక్ష్మప్ప (52) మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement