Wednesday, May 22, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టి న‌వీనారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటి నవీనారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నవీనారెడ్డి మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటుతున్నారన్నారు. తాను కూడా ఈరోజు పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతికి మేలు చేయాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి నవీనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డైరెక్టర్ సుకుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, చిరంజీవి సతీమణి సురేఖ ముగ్గురికి న‌వీనారెడ్డి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement