Tuesday, July 23, 2024

AP అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ : డీజీపీ

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ ఓపెన్ చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ముగ్గురిపై పీడీ యాక్ట్‌, మరో ఇద్దరిని బహిష్కరణకు సిఫార్సు చేశామన్నారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసుల్లో 1,522 మందిని, ఎన్నికల రోజు నమోదైన కేసుల్లో 2,790 మందిని గుర్తించామని తెలిపారు. ఎన్నికల అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. 41ఎ సిఆర్‌సి కింద కొందరిని అరెస్టు చేశామని, మరికొందరికి నోటీసులు అందజేశామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement