Monday, July 22, 2024

Visa | యూరప్‌ ట్రిప్‌ మరింత భారం.. పెరిగిన షెంజెన్‌ వీసా ఫీజు

ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. షెంజెన్‌ వీసా దరఖాస్తు ఫీజును 12 శాతం పెంచేందుకు యూరోపియన్‌ కమిషన్‌ ఆమోదం తెలిపింది. జూన్‌ 11 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని స్లోవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేఆల పౌరులకు ఇది వర్తిస్తుందని చెప్పారు.

ఇప్పటి వరకు పెద్దలకు షెంజెన్‌ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా, పెంచిన తరువాత అది 90 యూరోలు అవుతుంది. భారత కరెన్సీలో దాదాపు 8 వేల రూపాయలు. 6-12 సంవత్సరాల వయసున్న పిల్లల ధరఖాస్తు ఫీజు 40 యూరోల నుంచి 45 యూరోలకు పెంచారు. ద్రవ్యోల్బణం, సివిల్‌ సర్వెంట్ల వేతనాలు, పెరిగిన ఖర్చులు వంటి కారణాలతో షెంజెన్‌ వీసా ఫీజు రేట్లు పెంచినట్లు యూరోపియన్‌ కమిషన్‌ తెలిపింది. చివరి సారిగా వీసా ఫీజులకు 2020 ఫిబ్రవరిలో పెంచారు.

షెంజెన్‌ అంటే 29 ఐరోపా దేశాల సమాఖ్య, 90 రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా షెంజెన్‌ వీసాలను జారీ చేస్తారు. సమాఖలో ఉన్న ఒక దేశం షంజెన్‌ వీసా జారీ చేస్తే మిగిలి అన్ని దేశాల్లో పర్యటించే అవకాశం ఉంటుంది. ఇటలీ, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు ఈ పరిధిలో ఉన్నాయి. ఐరోపాకు వీసా దరఖాస్తుల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement