Thursday, May 16, 2024

నడిపెల్లికి అసెంబ్లీ టిక్కెట్టు… బిఆర్ఎస్ శ్రేణుల‌ సంబరాలు

హాజీపూర్ ఆగస్టు 21,(ప్రభా న్యూస్): టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నడిపెల్లి దివాకర్ రావు కే టికెట్ ఇవ్వడం పట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు, అవినీతి ఎరుగని మచ్చలేని మనిషి దివాకర్ రావు అని అన్నారు. మరోసారి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పై విశ్వాసం ఉంచి టిక్కెట్ కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ భారీ మెజారిటీతో మళ్లీ అసెంబ్లీకి పంపిస్తామని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తూ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబరాల్లో మండల పార్టీ అధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, స్థానిక ఎంపీపీ మందపల్లి – స్వర్ణలత శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమ, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement