Tuesday, July 23, 2024

Maharastra – షిర్డి సాయినాధుని సేవలో చంద్రబాబు దంపతులు ….

టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా నేడు మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు షిరిడీ పయనమయ్యారు.అక్కడ సాయినాథుడి దర్శనం చేసుకునున్నారు.

ఇక రాత్రికి ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ చేరుకోనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రాజకీయ కార్యకలాపాలతో ముమ్మరంగా గడిపిన చంద్రబాబు, పోలింగ్ పూర్తయ్యాక మళ్లీ పుణ్యక్షేత్రాల బాటపట్టారు. ఇప్ప‌టికే తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఆయ‌న తాజాగా కొల్హాపూర్, షిర్డీ వెళ్లారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement