Tuesday, July 23, 2024

RR: విద్యార్థినిపై యాసిడ్ దాడి?

శంకర్ పల్లి, ప్రభ న్యూస్ : శంకర్ పల్లి మండలం దొంతాన్ పల్లి వద్ద గల ఈక్ఫాయి యూనివర్సిటీలో అనుమానాస్పదంగా లా ఫైనల్ ఇయర్ విద్యార్థినిపై వేడినీళ్ళు పడటంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. అయితే ఆమె గాయపడిన విధానాన్ని పలువురు అనుమానిస్తున్నారు. ఆమెపై ప‌డింది వేడి నీళ్లు కాదు.. యాసిడ్ దాడి జరిగిందని అనుమానిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మోకిల పోలీసుల నుండి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement