Thursday, May 16, 2024

కోవ లక్ష్మికి టికెట్ కేటాయింపు పై బిఆర్ఎస్ నాయకులు సంబరాలు

జైనూర్ ఆగస్టు21(ప్రభన్యూస్) రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆసిఫాబాద్ నియోజవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధినేత చంద్రశేఖర రావు సోమవారం మూడోసారి కోవలక్ష్మికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేస్తూ ప్రకటించడంతో సోమవారం మండల కేంద్రంలో గ్రంధాలయ చైర్మన్ కనక యాదవరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కొమరం భీమ్ చౌరస్తాలో టపాసులు పేల్చి అనంతరం కోరుకొకరు స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ భువనలక్ష్మికి టికెట్ కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు మడవి భీమ్రావు ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కుమ్మర భగవంతరావు సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, నేతకాని మహా రాష్ట్ర అధికార ప్రతినిధి జాడీ రవీందర్, జైనూర్ సర్పంచ్ మెస్రం పార్వతీ లక్ష్మణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గీయడం లక్ష్మణ్ మారు అర్జునుల రహీం కోవ లక్ష్మీ అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement