Saturday, May 25, 2024

మాస్క్ ధరించకపోతే జరిమానా..

మెదక్ : రామాయంపేట మున్సిపల్ పరిధిలో మాస్క్ లు ధరించకుండా తిరిగితే జరిమానా విధిస్తామని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు మాస్కులు ధరించి మొదటిసారి బయట తిరిగితే రూపాయలు 100, రెండోసారి 500, వ్యాపార సంస్థల వారు మాస్కు ధరించకపోతే రూపాయలు 1000, రెండో విడతలో భాగంగా ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా వ్యాధి రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఇటువంటి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నిబంధనలకు అందరు సహకరించాలని కోరారు లేకుంటే కరోనా వ్యాధి విచ్చలవిడిగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement