Friday, May 31, 2024

TG | యాదాద్రి భ‌క్తుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి తిరుమల తరహాలోనే !

తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఏటా భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై తిరుమలలో మాదిరిగానే యాదాద్రిలో కూడా భక్తులు ఆన్‌లైన్‌లో స్వామివారి దర్శనంతో పాటు ఆర్జిత‌ సేవలను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

స్వామివారి దర్శనం టిక్కెట్లతో పాటు ఆర్జిత సేవా టిక్కెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు yadadritemple.telangana.gov.in ను సందర్శించాల‌ని.. అక్కడ‌ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఈవో తెలిపారు. ఈ సైట్‌ ద్వారా కూడా భక్తులు స్వామివారి ఈ-హుండీకి విరాళాలు ఇవ్వవచ్చని తెలిపారు. స్వామివారి దర్శనం, పూజా కైంకర్యానికి గంట ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని యాదాద్రి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement