Sunday, May 5, 2024

ఐక్యమత్యంతో ముందుకు వెళ్దాం – భావపురి జిల్లా సాధిద్దాం

బాపట్ల పట్టణాన్ని జిల్లా రూపురేఖలు గా తీర్చిదిద్దుతున్న ఉప సభాపతి కోన రఘుపతి కి ప్రజలు అన్ని పార్టీల రాజకీయ నాయకులు సహకరించాలని ప్రముఖ న్యాయవాది విన్నకోట సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం ఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపట్లను నల్లమడ జిల్లా చేయడానికి స్వర్గీయ కోన ప్రభాకరరావు ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న సమయంలో ఎంతో కృషి చేశారన్నారు.అనివార్య కారణాల రీత్యా నాడు రాలేకపోయిందని వివరించారు.ప్రస్తుతం ఉప సభాపతి కోన రఘుపతి గత 19 సంవత్సరలుగా బాపట్ల అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ,అభివృద్ధి పధంలో నడిపిస్తూ బాపట్ల ను జిల్లా చేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.జిల్లా అనేది ఎవరి వ్యక్తిగతం కాదని ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.జిల్లా కావడం వలన అన్ని వర్గాల వారికి,వ్యాపారులకు మంచి చేకూరుతుందన్నారు.జిల్లా కేంద్రంగా మారితే అన్ని ప్రధానమైన కార్యాలయాలు,కోర్టులు కూడా స్థానికంగానే ఉంటాయన్నారు.స్థానికంగా రూ.475 కోట్లతో నూతనంగా మెడికల్ కళాశాల నిర్మాణంకు అనుమతులు తిసుకువచ్చిన కోన రఘుపతి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాషా, బాస్కరరావు, ఉషారాణి,అవినాష్,కమల్,స్టాన్లీ,రవి,చలపతిరావు,శ్యామల,రాజారావు,సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement