Sunday, May 26, 2024

ధ్వజారోహణ..

దేవరకద్ర : తెలంగాణ రాష్ట్రంలో పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం సన్నిధిలో అలివేలు మంగతాయారు బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో రెండో రోజైన భక్తి శ్రద్ధలతో ధ్వజారోహణ కార్యక్రమం దేవతామూర్తుల కు ఆహ్వానం పలికారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్‌ రావు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్దలతో అమ్మవారికి అర్చకులు అభిషేకాలు నిర్వహించినట్లు వస్త్రాలతో, పూలతో అలంకరణ చేశారు. కోవిడ్‌ నిబంధనల ప్రకారమే అలివేలు మంగాతాయారు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్‌ రాజు , నిత్యానంద చారి ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement