Friday, May 10, 2024

మెరుగైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం….

కుత్బుల్లాపూర్ – జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రూ.70 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో నిధులకు కొరత లేకుండా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement