Wednesday, May 8, 2024

బెడ్డల విజయ్‌కుమార్ కి స్పూర్తి రత్న అవార్డు

బెల్లంపల్లి, సింగరేణి ఆపరేటర్స్‌ అండ్‌ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బెడ్డల విజయ్‌కుమార్‌కు ఉపాది పురస్కార్‌ 2021 స్పూర్తి రత్న అవార్డుతో పాటు తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డు వచ్చింది. వరంగల్‌లోని ఫాతిమానగర్‌లో బాల వికాస్‌ హాల్‌లో శ్రీ సుధా సేవా సమితీ ఆధ్వర్యంలో స్పూర్తి రత్న అవార్డుతో పాటు తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అవార్డులను బెడ్డల విజయ్‌కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బెడ్డల విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ అవార్డు అందుకోవడం గర్వకారణంగా ఉందని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నా వంతుగా తెలంగాణ ఉద్యమాన్ని చేయడం జరిగిందని, 10 సంవత్సరాలుగా ఒక యూనియన్‌లో పనిచేసినప్పటికీ సరైన లభించలేదని, చాలా అణచివేతకు గురయ్యానని అన్నారు. కార్మికులకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి ఆపరేటర్స్‌ అండ్‌ కార్మిక సంగాన్ని స్థాపించడం జరిగిందని అన్నారు. కార్మికులకు కావాల్సిన హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఆపరేటర్స్‌ అండ్‌ కార్మిక సంఘం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరి గట్టు చిరంజీవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లూరి మహేష్‌, నాయకులు దీక్షిత్‌, కోసాన స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement