Sunday, May 19, 2024

Permission – విదేశాల‌కు వెళ్తా… అనుమ‌తివ్వండి – సిబిఐ కోర్టులో జ‌గ‌న్ పిటిష‌న్

విజ‌య‌వాడ – ఎపిలో పోలింగ్ పూర్తి అయిన త‌ర్వాత విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌ సీబీఐ కోర్టు అనుమతి కోరారు. ఈనెల 17 నుంచి జూన్‌ 1 మధ్య లండన్‌, స్విట్జర్లాండ్‌, ఫ్రాన్స్‌ వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లొద్దన్న బెయిల్‌ షరతులు సడలించాలని ఇందులో కోరారు. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. త‌దుప‌రి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement