Tuesday, May 28, 2024

Manthani – కేసీఆర్‌, మోదీలు చేసేందేమి లేదు – మంత్రి దుద్ధిళ్ల శ్రీధ‌ర్ బాబు

పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ రాష్ట్రంలో ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించారే త‌ప్ప తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేద‌ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిప‌డ్డారు. కేంద్రంలో అదానీ, అంబానీ కోసం మోదీ పనిచేస్తున్నార‌ని అన్నారు. పెద్దపల్లిలో మంగ‌ల‌వారం శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు చేరారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని తిరిగి రాయలన్న కుట్రలో బీజేపీ ఉందని అన్నారు.

ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఉన్న కాంగ్రెస్ లోకి ఇతర పార్టీ నాయకులు వస్తున్నారని తెలిపారు. మంథనికి ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత‌ల‌ను ఉద్దేశించి దుద్దిళ్ల మాట్లాడుతూ, రిజర్వేషన్ల‌పై స్టాండ్ ఏంటో స్పష్టం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఓవైపు బలహీన వర్గాల రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతూనే వారి ఓట్లని ఎలా అడుగుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలోనే పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement