Saturday, July 27, 2024

IPL 2024 | ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ కీలక నిర్ణయం

ఐపీఎల్‌ 2024 ప్లే ఆఫ్స్‌లో నమోదు అయిన ఒక్కో డాట్‌ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలు నాటనుంది. క్వాలిఫయర్‌1, 2, ఎలిమినేటర్‌, ఫైనల్‌తో కలిపి మొత్తం 323 డాట్‌ బాల్స్ నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే టాటా కంపెనీ భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం 1,61,500 మొక్కలను నాటనుంది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఐపీఎల్ క్వాలిఫైయర్ 1లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో…. కోల్‌కతా నైట్ రైడర్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ మ‌ద్య జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 1లో కేకేఆర్ విజ‌యం సాధించి ఫైనల్ బెర్త్‌ను కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం 73 డాట్ బాల్స్ బౌల్ పడ్డాయి.

ఇదే అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడగా.. ఆర్సీబీపై ఆర్ఆర్ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మొత్తం 74 డాట్ బాల్స్ వేశారు.

ఇక చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై విజ‌యం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ మ్యాచ్‌లో మొత్తం 96 డాట్ బాల్స్ వేశారు. చెన్నైలోని ఇదే వేదికపై జరిగిన ఐపీఎల్ 2024 ఫైనల్లో కేకేఆర్ సన్‌రైజర్స్‌ను ఓడించి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 80 డాట్ బాల్స్ వేశారు.

కాగా, ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో మొత్తంగా 323 డాట్‌ బాల్స్ నమోదు అయ్యాయి. దీంతో బీసీసీఐ 1,61,500 మొక్కలు నాటనుంది. ప్లే ఆఫ్స్‌లో నటరాజన్‌ అత్యధిక డాట్‌ బాల్స్‌ వేశారు. మూడు ఇన్సింగ్స్‌లో 26 డాట్స్‌ వేసి 13 వేల మొక్కలు నాటేందుకు సహాయపడ్డారు. ఇదిలా ఉంటే.. గతేడాది 294 డాట్‌ బాల్స్‌ నమోదు కాగా… బీసీసీఐ, టాటా గ్రూప్ ఇండియా గ్రీన్ ఇనిషియేటివ్‌లో భాగంగా మొత్తం 1,47,000 మొక్కలు నాటింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement