Sunday, May 19, 2024

Award – రేపు ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు స్వీక‌రించ‌నున్న చిరంజీవి..

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఏప్రిల్ 22న ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేయగా, చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో, ఢిల్లీలో రేపు జరిగే ఓ కార్యక్రమంలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన స‌తీమ‌ణి సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరుకానున్నారు.

ఈ క్రమంలో చిరంజీవి ఈ సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement