Wednesday, May 8, 2024

TS : తల్లికి పాదాభివందనం…. కళ్ళలో ఆనంద భాష్పాలు… ఎంపీ అభ్యర్థి సుగుణ

జన్నారం,మార్చి 30 (ప్రభ న్యూస్): తల్లికి పాదాభివందనం చేసి,ఆ తర్వాత అక్కున చేర్చుకొని తల్లి నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళ నుంచి ఆనంద భాష్యాలు కార్చారు. ఏడకు బిడ్డా!అంటూ తల్లి ఓదార్చింది ఆమెనే ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ.

- Advertisement -

తిమ్మాపూర్ లో ఉన్న తన తల్లి కనక బూదుబాయి ఇంటికి శుక్రవారం రాత్రి 11:30 గంటలకు చేరుకున్నారు. ఆమె తల్లిదండ్రులు బూదుబాయి,రాజు 40 ఏళ్ల క్రితం కొమురం భీం అసిఫాబాద్ జిల్లా నుంచి తిమ్మాపూర్ వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఆమె తండ్రి రాజు 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అత్తమామలు చనిపోయారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ తను సొంత తల్లి 75 ఏళ్ల కనక బూదుబాయిని మండలంలోని తిమ్మాపూర్ లో రాత్రి కలిసి పాదాభివందనం చేసి నుదుటిపై ముద్దు పెట్టుకుని భావోద్వేగానికి గురై,కండ్లలో నుంచి ఆనందభాష్వాలు కార్చారు. బిడ్డా… ఏడవకంటూ తల్లి ఓదార్చింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిగా తొలి తొలిసారి ఆ గ్రామానికి వచ్చినందుకు కాంగ్రెస్ నేత చిందం చంద్రయ్య ,తమ్ముడైన మాజీ సర్పంచ్ కనక వెంకటేష్, చింతగూడ, పొనకల్, జన్నారం గ్రామాల కార్యకర్తలు, నాయకులు ఆమెకు శాలువాలు కప్పి సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement