Sunday, May 19, 2024

Jannaram – అమానవీయం – చెత్తకుప్పలో పసికందు

జన్నారం,మే6 (ప్రభ న్యూస్): ఓ చెత్తకుప్పలో నవజాత బేబిని కని గుర్తు తెలియని మహిళ బట్ట గుడ్డతో కట్టేసి పడేవేసిన హృదయ విచారకర సంఘటన ఇది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ విద్యానగర్ కాలనీ సమీపాన సోమవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మహిళ అప్పుడే ఓ బేబిని కని ఓ గుడ్డలో కట్టి చెత్తకుప్పలో పడేసింది. పాప ఏడ్పుల శబ్దం రావడంతో ఆ కాలనీ సమీపాన ఉన్న ఓ వ్యక్తి చూసి డయల్ 100కు సమాచారం అందించారు

.దీంతో స్థానిక సిఐ అల్లం నరేందర్ ఆదేశాల మేరకు ఎస్ ఐ గుండెటి రాజవర్దన్,బ్లూకోర్టు సిబ్బంది,పోలీసులు అక్కడికి చేరుకుని ఆ బేబిని స్థానిక భవాని పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. .ప్రస్తుతం ఆ పాప చికిత్స పొందుతుంది.ఈ సంఘటన మండలంలో చర్చనీయాంశమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement