అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. రాజస్థాన్ ముందు 222 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది. అనంతరం ఛేజింగ్కు దిగిన రాజస్థాన్.. బ్యాటింగ్లో తడబడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
రాజస్థాన్కు ఆదిలోనే షాక్ తగలింది. పవర్ ప్లే ముగిసే లోపు రాజస్థాన్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ సంజూ శాంసన్ (86) హాఫ్ సెంచరీ బాదాడు. జోస్ బట్లర్ (19), రియన్ పరాగ్(27), శుభమ్ దూబే (25) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇక మిగిలిన బ్యాటర్లు రాణించకపోవడంతో రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రసిఖ్ సలామ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.