హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని నేరుగా రాజ్భవన్ వెళ్లారు. అనంతరం పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.
మంగళవారం రాత్రి రాజ్భవన్లోనే ప్రధాని బస చేశారు. బుధవారం వేములవడ, వరంగల్ జిల్లాల్లో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాగా… మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు పీవీ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆలస్యంగానైనా తన తాత పీవీకి న్యాయం జరిగిందని, ఇందుకు ప్రధాని మోదీకి తమ కుటుంబం రుణపడి ఉంటుందని బీజేపీ సీనియర్ నేత, పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లోని పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.