Sunday, May 12, 2024

వేటగాళ్ల ఉచ్చులో రైతు మృతి

కన్నెపల్లి : కన్నెపల్లి మండలం దాంపూర్‌ గ్రామ సమీపంలో పొలాల్లో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు రైతు మేకల శంకర్‌ (50) బలి అయ్యాడు. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతులు మేకల శంకర్‌, నారాయణ ఇద్దరు కట్టెలు అమ్మేందుకు ఎడ్లబండిపై వీగాం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు దారి తప్పడంతో ఎడ్లబండి దిగి దారి వెతుకగా పత్తి చేనుకు బిగించిన ఉచ్చుకు శంకర్‌ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే చేరుకున్న నారాయణ గ్రామానికి వెళ్లి సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని తాండూరు సీఐ బాబురావు పరిశీలించి శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉచ్చు బిగించిన ఇద్దరు వ్యక్తులు ఆర్కం రమేష్‌, తలండి బాపులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement