Monday, July 22, 2024

AP | టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై వైసీపీ నేతల దాడి

ఏపీలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభమవనుండగా ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు తాడో పేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాయి. అక్కడక్కడ టీడీపీ వైసీపీ సిబ్బందికి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.

తాజాగా మచిలీపట్నంలో సర్కారుతోటలోని 46వ పోలింగ్ బూత్‌లో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ పోలింగ్ ఏజెంట్ రత్నాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలింగ్ బూత్‌లోకి ఏజెంట్‌గా సంతకం చేయడానికి వెళ్లిన రత్నాకర్‌పై కొందరు గుర్తు తెలియని వైసీపీ వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెల్లాచెదురు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement