Wednesday, July 24, 2024

TS: పిడుగుప‌డి రైతు మృతి.. ఐదుగురికి గాయాలు.. ఎమ్మెల్యే ప‌రామ‌ర్శ

ప్రభ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : ఉరుములు మెరుపులతో ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి తోడు పిడుగు పడ్డ సంఘటనలో ఒక రైతు మృతిచెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సంతో అకాల వర్షం కురిసింది. పంట చేనులో పిడుగుపాటుకు అదే గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ (29) అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదురికి తీవ్ర గాయాలయ్యాయి.


క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గాయపడ్డ భోజన్న నాగో రావు, టిల్లు అనే వ్యక్తులను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement