Saturday, July 27, 2024

TS: స‌ర‌స్వ‌తి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి..

బాసర, మే 11( ప్రభ న్యూస్) : ప్రసిద్ద పుణ్య క్షేత్రం చదువుల తల్లి కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తిని ఆలయ అధికారులు అర్చకులు మంగళ‌ వాయిద్యాలతో పూర్ణ కుంభస్వాగతం పలికారు.

అమ్మవారి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ కుటుంబ సభ్యులచే ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి ప్రత్యేక కుంకుమార్చన పూజలు జరిపించారు. అనంతరం అర్చకులు హారతినిచ్చి, అమ్మవారి ప్రసాదాలు అందించి శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. వీరి వెంట ఆలయ ఈఓ విజయరామారావు, ఆలయ అనువంశిక సభ్యుడు శరత్ పాటక్, ఎస్ఐ గణేష్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement