Thursday, May 2, 2024

భైంసా గురుకుల పాఠ‌శాల‌లో క‌రోనా క‌ల్లోలం – 35కి చేరిన పాజిటివ్స్…

భైంసా బాలుర గురుకుల పాఠశాలలో తాజాగా మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్‌ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండ్రోజుల్లో 90 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 35 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మ‌రో 90 మంది విద్యార్థుల కరోనా టెస్ట్ ఫ‌లితాలు రావ‌ల‌సి ఉంది.. అలాగే సిబ్బంది అందరికీ కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.. ఇక విద్యార్ధులంద‌రినీ ఐసోలేష‌న్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.. అదేవిధంగా ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు సెంట్‌పాల్‌ స్కూల్‌లో ముగ్గురికి, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయునికి కరోనా నిర్ధారణ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement