Sunday, May 5, 2024

జాతి రత్నాలు… వారంలో అదిరిపోయే కలెక్షన్స్

యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతి రత్నాలు. ప్రేక్షకులను నవ్వించటమే టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ చిత్రం అనుకున్నది సాధించింది. అంతే కాదు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో కలిపి మొత్తం రూ. 23.09 కోట్లు షేర్ వసూలు చేసింది.

కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.18 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.43 కోట్లు రాబట్టింది. దీంతో మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా రూ. 27.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 46 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది జాతి రత్నాలు సినిమా. ఇక ఈ సినిమాను స్వప్న సినిమా పతాకంపై నాగ్‌అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement