Thursday, May 16, 2024

TS | కాంగ్రెస్‌ నేత దారుణ హత్య.. వెంటాడీ గొంతు కోసిన దుండగులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పార్లమెంట్‌ ఎన్నికల వేళ బహిరంగ సభలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్‌లోని హసన్‌నగర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగ సభ జరుగుతుండగానే కాంగ్రెస్‌ నాయకుడు మక్బూల్‌ను కొందరు దుండగులు తరుముకుంటూ వెళ్లి, వెంటాడి మరీ అందరూ చూస్తుండగానే దారుణంగా గొంతు కోసి హత్య చేశారు.

దుండగులు వెంటాడటాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడ్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement