Thursday, May 16, 2024

TS: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి, మే 2 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాస గృహంలో ఇవాళ‌ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మార్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు పేర్కొన్నారు..

మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు దీపాదాస్ మున్షీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, చెన్నారెడ్డి, అల్లోల‌ గౌతమ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డిలు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement