Saturday, May 18, 2024

AP | రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం : చంద్రబాబు

రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డికి సరైన మొగుడు దొరికాడని, శ్రీకాంత్ రెడ్డికి రాంప్రసాద్ రెడ్డి సరైన ప్రత్యర్థి అని చంద్రబాబు అన్నారు. కూటమి అభ్యర్థి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో రాజంపేట వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమైందని చంద్రబాబు అన్నారు. ఈ నెల 13వ తారీఖు మార్పుకు నాంది, గెలుపునకు పునాది అని అన్నారు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… “సైకో జగన్ జగన్ మోహన్ రెడ్డి 99 శాతం మేనిఫెస్టో అమలు చేశానని చెప్పుకుంటున్నాడు. కానీ, 99 శాతం అమలు చేయలేదు. మేనిఫెస్టో అమలులో అతడికి గుండు సున్నా మార్కులు అని అన్నారు.

రాయచోటికి ఏమైనా పనులు చేశాడా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా? సొంత జిల్లాలో రైతుకు ఒక చిన్న పని, కనీసం ఒక సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేశాడా? కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మేలు చేశారు. ఆయన కేంద్రంలో కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన గెలిస్తే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది అని అన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా, ఓటు అడిగే హక్కు జ‌గ‌న్ కు లేదు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement