Saturday, May 25, 2024

జాతి రత్నాలు దర్శకుడితో ఎనర్జిటిక్ స్టార్ ?

జాతి రత్నాలు సినిమాతో అనుదీప్ తానేంటో నిరూపించుకుని తానేంటో నిరూపించుకున్నాడు. ప్రేక్షకులను థియేటర్లకు తప్పించడంలో సక్సెస్ అయ్యాడు. నవీన్ పోలిశెట్టి ,ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ నటనతో పాటు ఫరియా అబ్దుల్లా అందాలు సినిమాకి ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాతో అనుదీప్ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేశాడు. అయితే అనుదీప్ తరువాత సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది అంతా ఆసక్తిగా మారింది.

తాజాగా సమాచారం ప్రకారం రామ్ పోతినేని తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లైన్ చెప్పి రామ్ ను ఒప్పించినట్లు కూడా తెలుస్తోంది. ఈ సినిమాను స్రవంతి మూవీస్, వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మించబోతున్నారట. ఇక రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి రామ్ సరసన నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement