Thursday, May 9, 2024

మొదటిసారి పోటీకి సిద్దమవుతున్న ఖుష్బూ

సినీనటి బీజేపీ మహిళా నేత ఖుష్బూ మొదటిసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి వచ్చిన ఆమెకు బిజెపి విడుదల చేసిన తొలి జాబితాలో చోటు దక్కింది. చెన్నైలో ఉన్న థౌజండ్ పిల్లర్ లైట్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నారు. కాగా అన్న డిఎంకె బీజేపీ కలిసి పోటీకి దిగనుండటం తో డీఎంకే నుంచి ఆమెకు పోటీ రానుంది.

పార్టీ కోసం ఎంతో కష్టపడి నిజాయితీగా పని చేస్తున్న తన లాంటి వారిని పక్కన పెట్టారని మనస్తాపం చెందిన ఖుష్బూ బిజెపిలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు డీఎంకే లో ఉండేవారు. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టి చాలా ఏళ్లు అవుతున్నా మొదటిసారి ప్రత్యక్షంగా ఖుష్బూ పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement