Sunday, May 19, 2024

Thailand Open | తప్పుకున్న సింధు, సేన్‌..

ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక థైలాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ తప్పుకున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధతమవుతున్న వీరు థైలాండ్‌ ఓపెన్‌ నుంచి తమ పేర్లను విత్‌ డ్రా చేసుకున్నారు.

ఇక ఈ టోర్నీలో భారత జట్టుకు స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలో ముందుండి నడిపించనున్నారు. వీరు తొలి రౌండ్‌లో మలేషియా జంట నూర్‌ అహ్మద్‌ అజ్రిన్‌ అయూబ్‌-టా వీ కియోంగ్‌లతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌తో పాటు యువ ఆటగాళ్లు కిరణ్‌ జార్జ్‌, సతీశ్‌ కుమార్‌లు కూడా పోటీపడుతున్నారు. మహిళల విభాగం సింగిల్స్‌లో అష్మిత, ఆకర్షి కశ్యప్‌, మాళవిక బన్సోద్‌, ఉన్నతి హుడా బరిలోకి దిగుతున్నారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమిత్‌ రెడ్డి-సిక్కీ రెడ్డి, సతీశ్‌ కుమార్‌-ఆద్య జోడీలు పోటీల్లో పాల్గొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement