Friday, July 26, 2024

IPL : కోహ్లీలో ఆనందం…. ధోనిలో విచారం…

ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తదుపరి దశకు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి, నాలుగో స్థానాల్లో కేకేఆర్, ఆర్సీబీ ఫిక్స్ అయ్యాయి. రెండో స్థానం కోసం రాజస్థాన్, హైదరాబాద్ పోటీ పడుతున్నాయి.

- Advertisement -

అయితే ప్లేఆఫ్స్ బెర్త్ కోసం చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్‌ వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 27 పరుగుల తేడాతో నెగ్గింది.

విజయానంతరం ఆర్సీబీ నినాదాలతో స్టేడియం మార్మోగింది. బెంగళూరు ఆటగాళ్లంతా సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఈ సీజన్‌లో ఓ దశలో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ చివరి ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా గెలిచి టాప్-4లో నిలిచింది. దీంతో కోహ్లి ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు జట్టును గెలిపించలేకపోయాననే బాధతో ధోనీ మౌనంగా ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement