Thursday, May 16, 2024

తగ్గిన ఆదాయం ఎఫెక్ట్‌.. ఎక్స్‌లో మార్పులు చేసిన ఎలాన్‌ మస్క్‌

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోతుండడంతో దాని అధిపతి ఎలాన్‌ మస్క్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్స్‌ వేదికపై షేర్‌ చేసే లింక్స్‌కు సంబంధించిన హైడ్‌లైన్లు కనిపించేలా తిరిగి మార్పులు చేయనున్నట్లు తెలిపారు. గతంలో మాదిరి కాకుండా ఇకపై ఇమేజ్‌లపైనే లింక్‌కు సంబంధించిన హెడ్‌లైన్‌ కనిపిస్తుందని తెలిపారు.

పునరుద్ధరిస్తున్న ఈ హెడ్‌లైన్‌ ఆప్షన్‌కు సంబంధించి ఎలాన్‌ మస్క్‌ ఇతర వివరాలను వెల్లడించలేదు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, అసలు ఇమేజ్‌పై హెడ్‌లైన్‌ను ఎలా చూపించనున్నారనే విషయంపై స్పష్టత లేదు. లింక్‌ ప్రిప్‌వలకు సంబంధించిన హెడ్‌లైన్లు కనిపించకుండా ఎక్స్‌లో అక్టోబర్‌లో మార్పులు చేశారు. నెల రోజుల తరువాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు.

గతంలో చేసిన మార్పుతో వార్తల, వ్యాసాలకు సంబంధించిన లింక్‌లు కనిపించే విధానం మారిపోయింది. విషయం తెలుసుకోవడానికి యూజర్లు లీడ్‌ ఇమేజ్‌ పై భాగంలో కనిపించే లింక్‌పై కచ్చితంగా క్లిక్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వార్త, ప్రచురుణ సంస్థలు లీడ్‌ ఇమేజ్‌పైనే హెడ్‌లైన్‌ను రాయడం మొదలు పెట్టాయి.

- Advertisement -

ఎక్స్‌పై యూజర్లు వెచ్చించే సమయాన్ని పెంచడం కోసం పలు మార్పులు చేస్తున్నట్లు మస్క్‌ ఇప్పటికే ప్రకటించారు. హెడ్‌లైన కనిపించడం వల్ల దృష్టి దానిపైకి మళ్లి యూజర్లు లింక్‌పై క్లిక్‌ చేసి ప్లాట్‌ఫామ్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. లింక్స్‌ను కాకుండా నేరుగా కంటెంట్‌నే పోస్ట్‌ చేయాలని మస్క్‌ ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎంగేజ్‌మెంట్‌ పెరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement