Thursday, May 2, 2024

Victory – చివరి బంతికి రింకూ సింగ్ సిక్స్ – ఆసీస్ కి షాక్.. టీమ్ ఇండియా రివెంజ్. .

విశాఖపట్టణం సాగర తీరంలో భారత ఆటగాళ్లు దంచుకొట్టారు. ప్రపంచ కప్ ఓటమి తరువాత భారత్ మరోసారి ఆస్ట్రేలియా జట్టుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ తలపడుతోంది. ఇందులో భాగంగా గురువారం విశాఖపట్టణంలో మొదటి మ్యాచ్ లో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. ప్రపంచ కప్ 2023 ఫైనల్ లో ఓడిపోయిన కసితో టీమిండియా ఆటగాళ్లు జూలు విదిల్చారు. ఫలితంగా విశాఖ వన్డేలో భారత్ విజయకేతనం ఎగురవేసింది రింకూ సింగ్. చివరి బంతి కి సిక్స్ బాది టీమ్ ఇండియా కు విజయాన్ని అందించాడు . 49.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసిన భారత్ రెండు వికెట్ల తేడాతో ఆసీస్ ను చిత్తు చేసింది.

208 ప‌రుగుల ఛేద‌న‌లో య‌శ‌స్వీ జైస్వాల్(21) శుభారంభం ఇవ్వ‌డంతో.. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఇషాన్ కిషన్‌(58 బంతుల్లో ఫోర్లు, సిక్స‌ర్లు) రెచ్చిపోయ ఆడాడు. సూప‌ర్ హాఫ్ సెంచ‌రీతో ఆసీస్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు 25 ర‌న్స్‌కే 2 వికెట్లు పడిన స‌మ‌యంలో ఇషాన్‌తో సూర్య‌ మూడో వికెట్‌కు133 ప‌రుగులు జోడించాడు. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలారేగారు. ఆసిస్ బౌలర్లకు చుక్కులు చూపించారు. కేవలం 42 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ కు మ్యాచ్ ఫినిష్ చేసే అవకాశం ఉన్నా దాన్ని చేజార్చుకున్నాడు. 18వ ఓవర్ నాలుగో బంతికి సూర్య ఔటయ్యాడు. అతను జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ బంతికి ఆరోన్ హార్డీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పడ్డాడు ఇక. ఆఖ‌రి ఓవ‌ర్లో 7 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌వ్వ‌గా.. రింకూ తొలి బంతికి బౌండ‌రీ బాదాడు. ఇక గెలుపు పూర్త‌యిన‌ట్టే అనుకున్న స‌మ‌యంలో అక్ష‌ర్ ప‌టేల్, బిష్ణోయ్ వ‌రుస బంతుల్లో పెవిలియ‌న్ చేరారు. ఆ త‌ర్వాత బంతికి రెండు ప‌రుగులు తీసే క్ర‌మంలో అర్ష్‌దీప్ రనౌట‌య్యాడు. అప్ప‌టికీ స్కోర్లు స‌మం అయ్యాయి. ఇక చివ‌రిబంతికి సిక్స‌ర్‌తో రింకూ మ్యాచ్ ముగించాడు.. రింకూ 22 పరుగులు చేశాడు. చివరి బంతి నో బాల్ కావడం కొస మెరుపు ..

ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లిస్ జోష్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో వీర విహరం చేశాడు.. ఫోర్లు , సిక్సర్లతో మోత మోగించిన జోష్.. తొలుత కేవలం 29 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు.హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత రెచ్చిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ చేయడానికి కేవలం 18 బంతులే తీసుకున్నాడంటే జోష్ ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు. ఇది అతని టీ20ల్లోనూ, భారత్‌పైనా తొలి సెంచరీ. అర్ష్‌దీప్ వేసిన 17వ ఓవర్ 4వ బంతికి ఫోర్ బాదిన ఇంగ్లిస్ జోష్ సెంచరీ పూర్తి చేశాడు.

శతకం పూర్తయిన తర్వాత కూడా అదే జోరు కొనసాగించే క్రమంలో జోష్ ఇంగ్లిష్ 110 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రసిద్ధ్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడిన జోష్.. డీప్ మిడ్ వికెట్‌లో యశస్వి జైస్వాల్‌కు చిక్కాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు వుండగా.. స్ట్రైక్ రేట్ 224.49. టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రెండవ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఆరోన్ ఫించ్ సరసన జోష్ నిలిచాడు. 2013లో సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌పై ఫించ్ ఈ రికార్డు నెలకొల్పాడు. అలాగే జోష్.. టీ20లలో సెంచరీ చేసిన ఐదవ ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. అతని దూకుడుతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 52, మాథ్యూ షార్ట్ 13, మార్కస్ స్టోయినిస్ 7, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్‌లు చేరో వికెట్ పడగొట్టారు

ఇక 80 పరుగులు చేసిన స్కై కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement