Friday, May 17, 2024

HYD: పోలీసుల తనిఖీలు.. కంట్రీ మేడ్ రివాల్వర్, బుల్లెట్లు స్వాధీనం

ఎన్నికల కోడ్ అమల్లో ఉండ‌డంతో పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్ పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువులతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. అదేవిధంగా రౌడీ షీటర్లు, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్ లోని జీడిమెట్లలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండ‌గా.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాల్ దగ్గర కంట్రీమేడ్ రివాల్వర్, మూడు బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు విశాల్ ను అదుపులోకి తీసుకుని ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement