Thursday, May 16, 2024

Congress – క‌రెంట్ అడ్డుపెట్టుకుని దోచుకున్న దొంగ కెసిఆర్ – మంత్రి పొంగులేటి

విద్యుత్ కొనుగొలులో అన్ని అక్ర‌మాలే
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్క‌టే
ఈ రెండు పార్టీలను ఏడు అడుగుల గోతిలో పాతాల్సిందే..

ఖ‌మ్మం – మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ‌న్ని దొంగ మాటలు అని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఆ రెండు పార్టీలను ఏడు అడుగుల లోతుల గొయ్యి తీసి పాతి పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం దమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ నేడు నిర్వ‌హించిన కార్నర్ మీటింగ్ మంత్రి మాట్లాడుతూ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో మోసం చేసిన బీజేపీని కెసిఆర్ ఎందుకు నిలదీయలేదన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే జైల్లో పెడతారని కెసిఆర్ కు భయమన్నారు. పగలు తిట్టుకోవడం రాత్రిపూట బతిమాలు కోవటం కెసిఆర్ కు అల‌వాటంటూ వ్యక్తం చేశారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక్క సీటు రాని కేసీఆర్ ఖ‌మ్మంలో నామా గెలిస్తే కేంద్ర‌ మంత్రి ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. దీంతో బీజేపీతో పొత్తు ఉందని చెప్పకనే చెబుతున్నార‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం ఇబ్బంది పడొద్దన్నారు. తన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా ఇబ్బంది పడనీయకుండా చూసుకునే బాధ్యత నాది అన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటున్న కేసీఆర్.. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మూడు రూపాయల యూనిట్ని 20 రూపాయిల‌కు కెసిఆర్ కొనుగోలు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యూనిటీ మూడు రూపాయల 50 పైసలకే కరెంటు కొంటున్నామన్నారు. కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది కేసీఆర్ అంటూ పొంగులేటి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement