ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా మరి కాసేపట్లో ప్రారంభం కావాల్సిన సన్రైజర్స్ హైదరాబాద్ – గుజరాత్ టైటాన్స్ మ్యాచ్కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఉప్పల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ఈ మ్యాచ్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచగా వర్షం గ్యాప్ లేకుండా పడుతోంది.
మరో రెండు గంటల పాటు ఇదే పరిస్థితి ఇలానే ఉంటే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మైదానంలోకి వర్షపు నీరు భారీగా చేరింది. వర్షం ఆగినా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించనున్నారు. అప్పుడు ఎలాంటి సమీకరణాలు లేకుండా సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోనుంది.